చర్ల గ్రామాన్ని పరిశుభ్రత వైపు నడిపిస్తున్న పంచాయతీ సెక్రటరీ బి. రాంబాబు.

Picture of Rushi Kumar Sutar

Rushi Kumar Sutar

Chief Editor

నేటిసూర్య న్యూస్:  చర్ల మేజర్ గ్రామపం చాయతీకి ఇటీవల నూతనంగా బాధ్యతలు చేపట్టిన పంచాయతీ సెక్రటరీ బానోతు రాంబాబు తన పనితీరుతో గ్రామ ప్రజల ప్రశంసలు అందుకుం టున్నారు. బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల వ్యవధిలోనే గ్రామ పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అనేక కార్యక్రమాలను చేపడు తున్నారు.

గ్రామంలోని ప్రధాన రహదారులతో పాటు అంతర్గత వీధుల ఇరువైపులా పేరుకుపోయిన చెత్తను పంచాయితీ సిబ్బంది ద్వారా తొలగించి స్వచ్ఛమైన వాతావరణాన్ని కల్పిస్తున్నా రు. అలాగే చాలా కాలంగా శుభ్రం చేయని డ్రైనేజీలను సిబ్బందితో నిరంతరం శుభ్రపరచిస్తూ దుర్వాసనలు, దోమల సమస్యలు తగ్గేలా చర్యలు తీసుకుంటున్నారు.

పరిశుభ్ర గ్రామం లక్ష్యంగా కార్యాచరణ

గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణను మరింత మెరుగుపరిచేందుకు ప్రతిరోజూ పరిశీలనలు నిర్వహిస్తూ, సిబ్బందికి తగిన సూచనలు ఇస్తున్నారు. గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారిశుద్ధ్య పనులు నిరంతరం కొనసాగించేలా ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.

ప్రజలతో మమేకమై సమస్యల పరిష్కారం

సెక్రటరీ రాంబాబు కార్యాలయానికే పరిమితం కాకుండా గ్రామంలో ప్రత్యక్షంగా పర్యటిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను వెంటనే స్పందించి పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. గ్రామాభివృద్ధి, పరిశుభ్రత, ప్రజారోగ్యం వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని స్థానికులు పేర్కొంటున్నారు.

ప్రజల ప్రశంసలు

చర్ల గ్రామంలో ఇటీవల కనిపిస్తున్న పరిశుభ్రమైన వాతావరణం వెనుక సెక్రటరీ బానోతు రాంబాబు కృషి ఉందని గ్రామస్థులు అభిప్రాయప డుతున్నారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయమని పలువురు గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు ప్రశంసిస్తున్నారు.

గ్రామ పరిశుభ్రత, పారదర్శక పాలన, ప్రజలకు అందుబాటులో ఉండే సేవల ద్వారా బానోతు రాంబాబు చర్ల గ్రామాభివృద్ధికి కొత్త ఊపును తీసుకొస్తున్నారని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

Share :

 నోటిఫికేషన్స్