నేటి సూర్య ప్రతినిధి:
ప్రజా సమస్యలే తమ ధ్యేయంగా పనిచేసే వ్యక్తికి మద్దతిచ్చి ప్రజలు ఆశీర్వదించాలని కొమరం సావిత్రి కోరుతున్నారు. రాబోయే ఎన్నికల్లో ఓట్లు వేసి బాధితుల అవసరాలను తీర్చేంత గొప్ప మనసున్న మారాణి సావిత్రమ్మ అని ప్రజలు అభిప్రాయ పడుతున్నారు. బూర్గంపాడు మండలం సారపాక మేజర్ గ్రామ పంచాయతీకి త్వరలో జరగనున్న సర్పంచ్ ఎన్నికల్లో 15వ వార్డు మెంబర్ గా కొమరం సావిత్రి పోటీ చేయబో తున్నారు .ప్రజా సమస్యలే తమ ధ్యేయం గా పనిచేసే సావిత్రి ని ప్రజలు ఆశీర్వదించండి రాబోయే ఎన్నికల్లో ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. వార్డుల్లో రోజురోజుకు పెరిగిపోతున్న చెత్తాచెదారం, వీధిలైట్లు వెలగాలన్న ప్రశ్నించే దమ్ము, ధైర్యమున్న ప్రజాప్రతినిధి ప్రజలకు కావాలని ప్రజలు కోరుతున్నారు. ఐటీసీ సంస్థ నుండి వెలువడే కాలుష్య నియంత్రణ నుండి ప్రజలు అనారోగ్య పాలు కాకుండా ఉండాలంటే ప్రజా మద్దతుతో కాలుష్య నియంత్రణకు పోరాట పటిమ కలిగిన ప్రజా ప్రతినిధిగా ప్రజల తరఫున పోరాడేందుకు సావిత్రమ్మకు పట్టం కట్టి ఆరోగ్యాలను కాపాడుకోవాలని పలువురు రాజకీయవేత్తలు అభిప్రాయ పడుతున్నారు.











