- నేటిసూర్య ప్రతినిధి:
రాజమండ్రిలో జరిగిన ఒక వివాహ వేడుకకు మండపేట శాసనసభ్యులు జోగేశ్వరరావు చర్ల రైతులకు చైర్మన్ టిడిపి జిల్లా నాయకులు కొత్తపల్లి రామాంజనేయులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు .సామాజిక సేవా కార్యక్రమాలు, రైతు సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న కొత్తపల్లి రామాంజనేయులు గారిని పలువురు నాయకులు, అభిమానులు ఆప్యాయంగా పలకరించారు. వివాహ వేడుకలో ఆయన పాల్గొనడం ద్వారా అక్కడి వాతావరణం మరింత ఆత్మీయంగా మారింది.
కొత్తపల్లి రామాంజనేయులు గారు వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో నిండిపోవాలని ఆకాంక్షించారు. అనంతరం అతిథులతో కలిసి ముచ్చటిస్తూ వేడుకలో పాల్గొన్నారు.
Post Views: 18











