చిన్న అరుణాచలేశ్వర ట్రస్ట్ సేవా కార్యక్రమం

Picture of Rushi Kumar Sutar

Rushi Kumar Sutar

Chief Editor

భద్రాచలం బ్రిడ్జి సెంటర్ ఆటో డ్రైవర్లకు చల్లని నీటి సౌకర్యం.

 చిన్న అరుణాచలేశ్వర ట్రస్ట్ సేవా కార్యక్రమం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలం పవిత్ర పుణ్యక్షేత్రం దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులతో నిత్యం కళకళలాడుతూ ఉంటుంది. శ్రీ సీతారామచంద్రస్వామి వారి దర్శనం కోసం వచ్చే వేలాది మంది భక్తులకు సులభంగా రవాణా సౌకర్యం కల్పిస్తూ బ్రిడ్జి సెంటర్ ఆటో డ్రైవర్లు  సేవలను అందిస్తున్నారు. ఎండ తీవ్రత పెరిగినందున ఆటో  డ్రైవర్లు ఎదుర్కొనే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఒక గొప్ప సేవా కార్యక్రమం నిర్వహించబడింది.

చిన్న అరుణాచలం క్షేత్రం తరఫున, శ్రీ అరుణాచలేశ్వర ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీ శ్రీ శ్రీ శివ నాగ స్వామి వారు బ్రిడ్జి సెంటర్ ఆటో స్టాండ్ వద్ద డ్రైవర్ల కోసం సుమారు ₹14,500 విలువ చేసే ఆధునిక వాటర్ కూలర్‌ను అందజేశారు. దీని ద్వారా రోజంతా కష్టపడి పనిచేసే డ్రైవర్లకు చల్లని తాగునీరు అందుబాటులోకి రావడం వల్ల వారి ఆరోగ్యానికి మేలు చేకూరనుంది.

ఈ సందర్భంగా శివ నాగ స్వామి మాట్లాడుతూ, “భక్తులకు సేవలందించే ఆటో డ్రైవర్లు కూడా సమాజానికి సేవ చేస్తున్న వారే. వారి శ్రమను గౌరవించడం మన బాధ్యత. వారి ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఇలాంటి చిన్నచిన్న సౌకర్యాలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి” అని తెలిపారు. భవిష్యత్తులో ఆటో డ్రైవర్లకు ఏవైనా ఆరోగ్య సంబంధిత సమస్యలు తలెత్తితే చిన్న అరుణాచలం క్షేత్రం తరఫున తగిన సహాయం అందించేందుకు సిద్ధంగా ఉంటామని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లు ఆనందం వ్యక్తం చేస్తూ, తమ అవసరాన్ని గుర్తించి ఈ సదుపాయం కల్పించిన ట్రస్ట్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు తమకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చి, భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రేరణ కలిగిస్తాయని చెప్పారు.

భక్తి, సేవా భావం కలిసిన ఈ కార్యక్రమం స్థానికంగా ప్రశంసలు అందుకుంటూ, సమాజంలో సేవా స్పూర్తిని మరింత పెంపొందిస్తోంది.

ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు వేముల రవి, మహేష్, మణికుమార్ అరుణసేవా గణం కార్యదర్శి దామెర్ల మాధవి పాల్గోన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :

 నోటిఫికేషన్స్