కొత్తగూడెం ,నేటిసూర్య ప్రతినిధి:
జూన్ 2వ తేదీన హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ అవార్డును అందుకున్న కొత్తగూడెం త్రీ టౌన్ ఇన్ స్పెక్టర్ శివప్రసాద్ ను సోమవారంజిల్లా ఎస్పీ రోహిత్ రాజు తమ కార్యాలయంలో ప్రత్యేకంగా అభినందించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించి నందు కుగాను ఇన్స్పెక్టర్ శివప్రసాద్ ఈ అవార్డును దక్కించుకున్నారు. పోలీస్ శాఖలో క్రమశిక్షణ, నిబద్ధతతో పనిచేసే అధికారులు, సిబ్బందికి ఎప్పటి కైనా ప్రత్యేక గుర్తింపు, గౌరవం లభిస్తుందని ఈ సందర్భంగా ఎస్పీ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డిఎస్పి అబ్దుల్ రహమాన్ కూడా పాల్గొన్నారు.
Post Views: 125