చర్లలో ఘనంగా టిడీపి 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు…..తెలుగు జాతీ విలువలను దేశమంతట చాటిన ఘనత టీడీపీదే

Rushi Kumar Sutar

Rushi Kumar Sutar

Chief Editor

దేశమంతటా తెలుగుజాతి విలువలను చాటిన ఘనత టిడిపి దే.

టిడిపి జిల్లా నాయకులు కొత్తపల్లి రామాంజనేయులు

చర్ల, నేటిసూర్య ప్రతినిధి: చర్లలో తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా టిడీపి జిల్లా నాయకుడు,రైతు క్లబ్ చైర్మన్ కొత్తపల్లి ఆంజనేయులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కొత్తపల్లి రామాంజనేయులు, పార్టీ సీనియర్ నాయకులు, సొసైటీ మాజీ వైస్ చైర్మన్ కాకర్ల సుందరంలు టిడిపి పార్టీ ఆవిర్భావ నేత ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారి చేతుల మీదుగా పార్టీ జెండ ఆవిష్కరించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఉత్సాహంతో జై తెలుగుదేశం , జోహార్ ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా నాయకులు, రైతు క్లబ్ చైర్మన్ కొత్తపల్లి ఆంజనేయులు మాట్లాడుతూ ప్రజలందరికీ తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు .దేశంలోనే తెలుగు జాతి కోసం తెలుగుదేశం పార్టీ స్థాపించిన తెలుగుజాతి యొక్క కీర్తిని చాటి చెప్పిన నాయకుడు దివంగత నేత ఎన్టీఆర్ అని కొనియాడారు. సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు నినాదనంతో ఏర్పడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి తెలుగుదేశం పార్టీ అని , పేదవాడి కష్టంలో నుండి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు. తెలుగుజాతి సంక్షోభంలో వున్న ప్రతిసారి వారికి వెలుగునిచ్చేది తెలుగుదేశం పార్టీఏ అని గుర్తుచేశారు. రెండూ రుపాయలకు కిలో బియ్యం అందించిన ఘనత టీడీపీ పార్టీకి చెందుతుంది అని, రానున్న ఆ స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణలో పోటీచేసి తద్వారా పార్టీ తెలంగాణాలో కూడా సత్తా చాటుతం అని తెలియ చేశారు. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు ఎడ్ల సత్తిబాబు, నల్లూరు మురళీ ,ఏడారి సత్యనారాణయన ,రేగల్ల సుధాకర్, చిన్నబాబు, చంటి, బేత ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

Share :

 నోటిఫికేషన్స్