పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్ సంపన్నులకు, కార్పొరేట్‌ వ్యక్తులకు అనుకూలంగా ఉంది.

Rushi Kumar Sutar

Rushi Kumar Sutar

Chief Editor

పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్ సంపన్నులకు, కార్పొరేట్‌ వ్యక్తులకు అనుకూలంగా ఉంది.

– సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నిమ్మల వెంకన్న

పినపాక, నేటిసూర్య న్యూస్

కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్ సంపన్నులకు, కార్పొరేట్‌ వ్యక్తులకు అనుకూలంగా ఉందని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నిమ్మల వెంకన్న మండిపడ్డారు. కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను వ్యతిరేకిస్తూ బుధవారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి ప్లకార్డులతో ఈ బయ్యారం క్రాస్ రోడ్ లో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నిమ్మల వెంకన్న మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ జీఎస్టీ చెల్లిస్తున్న సామాన్య, మధ్యతరగతి ప్రజలకు వ్యతిరేకంగా ఉందని, వ్యవసాయ రైతాంగానికి, నిరుద్యోగులకు బడ్జెట్‌లో నామమాత్ర కేటాయింపులే ఉన్నాయని అన్నారు. దేశంలో రోజు, రోజు పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలను నియంత్రించడం కోసం బడ్జెట్ రూపొందించలేదని ఆరోపించారు. బడ్జెట్‌లో తెలంగాణ విభజన హామీ కేటాయింపులు లేవని, జాతీయ గ్రామీణ ఉపాధి పనులను సంవత్సరానికి 200 రోజులకు పెంచుతూ, కూలిని రూ.600 లు చెల్లించే విధంగా బడ్జెట్ రూపొందించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి దుబ్బా గోవర్ధన్, మండల కమిటీ సభ్యులు మడివి రమేష్, తదితరులు పాల్గొన్నారు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

Share :

 నోటిఫికేషన్స్