Amitabh Kant: 2047 నాటికి 35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్..

Picture of Rushi Kumar Sutar

Rushi Kumar Sutar

Chief Editor

భారత్ 2047 నాటికి 35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారడానికి రాబోయే మూడు దశాబ్దాల్లో 9-10 శాతం వృద్ధి రేటును సాధించాలని అమితాబ్ కాంత్ అన్నారు.

2027 నాటికి జపాన్ జర్మనీలను అధిగమించి భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని అమితాబ్ కాంత్ అంచనా వేశారు. “2047 నాటికి 35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారడమే కాకుండా తలసరి ఆదాయాన్ని ఇప్పుడున్న 3,000 డాలర్ల నుంచి 18,000 డాలర్లకు పెంచాలన్నదే మా ఆశయం” అని అమితాబ్ కాంత్ అన్నారు.

ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ విలువ 3,600 బిలియన్ డాలర్లుగా ఉంది. భారత్‌కు గ్రోత్‌లో ఛాంపియన్‌గా మారాలంటే కనీసం 12 రాష్ట్రాలు అవసరమని, అవి 10 శాతానికి పైగా వృద్ధి చెందాల్సి ఉంటుందని కాంత్ చెప్పారు. “భారతదేశం మరింత ఎక్కువ రేటుతో అభివృద్ధి చెందాలి. మూడు దశాబ్దాల పాటు భారతదేశం ప్రతి సంవత్సరం 9-10 శాతం చొప్పున వృద్ధి చెందాలి” అని అన్నారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ అక్టోబరు-డిసెంబర్ 2023లో ఊహించిన దానికంటే మెరుగైన 8.4 శాతం వృద్ధిని సాధించిందన్నారు.

 

ఇది గత ఒకటిన్నర సంవత్సరాల్లో అత్యధిక స్థాయి అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు అంచనాను 7.6 శాతానికి తీసుకెళ్లేందుకు ఇది దోహదపడిందన్నారు. జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, బీహార్ వంటి రాష్ట్రాల వృద్ధిరేటు ఎక్కువగా ఉండాలన్నారు. “ఈ రాష్ట్రాలు 10 శాతానికి పైగా వృద్ధి చెందితే, భారతదేశం 10 శాతానికి పైగా వృద్ధి చెందుతుంది.” లోక్‌సభ ఎన్నికల తర్వాత భారత్ విద్య, ఆరోగ్యం, పోషకాహారంలో భారీ సంస్కరణలు చేపట్టాలని అమితాబ్ కాంత్ అన్నారు .

భారతదేశంలోని ఎనిమిది ప్రధాన పరిశ్రమలు గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే ఈ ఏడాది ఫిబ్రవరిలో 6.7 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ఈ సమాచారం గురువారం విడుదల చేసిన అధికారిక డేటా నుంచి బయటకు వచ్చింది. దీని ద్వారా ఎనిమిది ప్రధాన పరిశ్రమలలో పారిశ్రామిక ఉత్పత్తి సూచిక (ఐఐపి)లో చేర్చబడిన వస్తువుల వాటా 40.27 శాతంగా ఉంది. అందువల్ల ఇది మొత్తం పారిశ్రామిక వృద్ధి రేటు సాధించింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :

 నోటిఫికేషన్స్